Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈటీఎస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా లెజా శామ్‌ ఊమ్మెన్‌ నియామకం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 16,2021

ఈటీఎస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా లెజా శామ్‌ ఊమ్మెన్‌ నియామకం

నవతెలంగాణ హైదరాబాద్: లాభాపేక్షలేని ఈటీఎస్‌ నేడు ఈటీఎస్‌ ఇండియాను అధికారికంగా ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. తద్వారా భారతదేశంలో తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు కార్యాలయం ఏర్పాటుచేయడంతో పాటుగా సంస్థ యొక్క అంతర్జాతీయ పాదముద్రికలను విస్తరించి,  అభ్యాసకులకు  తమ జీవితాంతపు విద్యా ప్రయాణంలో సేవలనూ అందించనుంది. లెజో శామ్‌ ఊమ్మెన్‌, ఈటీఎస్‌ ఇండియాకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సేవలనందించనున్నారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, భారతదేశంలో తమ ఉత్పత్తులు, సేవల కోసం  ఈటీఎస్‌ యొక్క వృద్ధి వ్యూహాలను అభివృద్ధి చేయడంతో పాటుగా అమలు చేయడమూ ఊమ్మెన్‌ చేయనున్నారు.
        భారతదేశపు విద్యా సమాజానికి మద్దతునందించడానికి ఈటీఓస్‌ కట్టుబడి ఉంది. దేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా అభ్యాసకులకు మద్దతునందించడంలో  అత్యంత సహజమైన ముందడుగుగా ఈటీఎస్‌ ఇండియా నిలుస్తుంది. అదే సమయంలో ఉన్నత విద్యా సంస్థలు విభిన్నమైన గ్రాడ్యుయేట్‌ విద్యార్థులను ఆకర్షించడం కొనసాగించడంలోనూ తోడ్పడనుంది. ఈటీఎస్‌ ఇండియా ఏర్పాటుతో దేశంలో కీలక భాగస్వాములతో సంస్థ యొక్క  సంబంధాలు మరింతగా బలోపేతం కావడం కొనసాగనుంది. పాఠశాలలు, ఇనిస్టిట్యూట్‌లు, కార్పోరేషన్‌లు, విద్యా సంస్థలు, భాషా శిక్షకులు,  విదేశాలలో విద్యకు సలహాదారులు సహా  సహకారం, పెట్టుబడుల పరంగా ఈటీఎస్‌తో పాటుగా భారతీయ వ్యాపార సంస్థలకు  మెరుగైన అవకాశాలు అందించనుంది.
      ‘‘నూతన విద్యా విధాన (ఎన్‌ఈటీ)కార్యాచరణ ద్వారా భారతీయులందరికీ నాణ్యమైన విద్యావకాశాలను మెరుగుపరచడం, తగు రీతిలో సంస్కరణలు చేయడం, వాటిని విస్తృతం చేయాలనే మరియు భారతీయ విద్యార్థులకు మెరుగైన అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలనే భారతదేశపు ధైర్యవంతమైన, దూరదృష్టితో కూడిన విధానానికి  అనుగుణంగా ఈటీఎస్‌ ఉంటుంది’’ అని మొహమ్మద్‌  కౌషా, అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ గ్రోత్‌–ఈటీఎస్‌ అన్నారు. ‘‘విద్య పరంగా ప్రతి ఒక్కరికీ నాణ్యత, సమానత్వం  పెంపొందించాలనే ఈటీఎస్‌ యొక్క లక్ష్యిత ఆధారిత విధానం ఈ ముందు చూపుకు అనుగుణంగా ఉంటుంది.  భారతీయుల కోసం భారతదేశంలో అభ్యాస అవకాశాలను విస్తరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. లెజో మా బోర్డ్‌పై రావడంతో మా లక్ష్యం సాకారం కావడంలో సహాయపడగలరు’’అని అన్నారు.
         ‘‘భారతదేశంలో ఉన్న అభ్యాసకులపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటుగా  భవిష్యత్‌లో అంతర్జాతీయంగా ఉన్న అభ్యాసకులకు సేవలనందించాలనే లక్ష్యంలో భాగంగా సంస్థ గణనీయంగా మార్పుకు లోనవుతున్న వేళ ఈటీఎస్‌లో చేరడం,  సంస్ధ భారతీయ కార్యాలయం, సిబ్బందికి నేతృత్వం వహించనుండటం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని  ఊమ్మెన్‌ అన్నారు. ‘‘భారతదేశంలో ఇప్పటికే బలీయంగా ఉన్న పునాదులపై నిర్మించడంతో పాటుగా టోఫెల్‌ ఎస్సెస్‌మెంట్స్‌, జీఆర్‌ఈ టెస్ట్‌ మరియు టోఇక్‌ పరీక్షతో పాటుగా నూతన అభ్యాస ఉపకరణాలు, వ్యాపార అవకాశాలు సహా ఈటీఎస్‌ యొక్క ప్రస్తుత ఉత్పత్తులను బలోపేతం చేయడం నా లక్ష్యం’’ అని అన్నారు.
   పియర్శన్‌ వద్ద ఊమ్మెన్‌ జనరల్‌ మేనేజర్‌గా సేవలనందించారు. పీటీఈ అకడమిక్‌ పరీక్ష  ఆయన  పర్యవేక్షణలో జరిగింది. ఈ సంస్థ శక్తివంతమైన వ్యాపార పనితీరుకు, ఈ సంస్థ వృద్ధి, ఆదాయం, నిర్వహణ పనితీరు, లాభదాయకత పరంగా ఆయన అందించిన తోడ్పాటు పరంగా గుర్తింపు పొందారు. పియర్శన్‌కు ముందు, రిలయన్స్‌ మనీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర సంస్థలలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బెంగళూరు యూనివర్శిటీ పూర్వ విద్యార్థి ఆయన.
         కొవిడ్‌ 19 ప్రభావం చూపినప్పటికీ, పరిశోధన, పరిశీలన పరిష్కారాలను అందించడంపై ఈటీఎస్‌ తమ దృష్టిని కొనసాగిస్తుంది. భారతీయ విద్యార్థులు, ఇనిస్టిట్యూట్‌ల అవసరాలు, ఆసక్తులకు తగిన సేవలను అందిస్తుంది. తద్వారా వారి విద్యావసరాలు, ఇతర అవసరాల పరంగా ఎలాంటి అవరోధాలూ ఎదురుకావడం లేదు.  ఇంటి వద్దనే పరీక్షలు రాసే అవకాశం కల్పించే టోఫెల్‌ ఐబీటీ హోమ్‌ ఎడిషన్‌, జీఆర్‌ఈ జనరల్‌ టెస్ట్‌ ఎట్‌ హోమ్‌ ప్రారంభించడం అలాగే భారతదేశంలో ప్రత్యామ్నాయ  గుర్తింపు కార్డుగా ఆధార్‌కార్డును  వినియోగించడం, టోఫెల్‌ ఎసెన్షియల్‌ కిట్‌ను ఆవిష్కరించడం ద్వారా ఇది నిరూపితమైంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.