Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అత్యవసర కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన పేస్‌ హాస్పిటల్స్‌ బృందం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 07,2022

అత్యవసర కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన పేస్‌ హాస్పిటల్స్‌ బృందం

హైద‌రాబాద్‌ : తీవ్రమైన కామెర్లు మరియు రెండు వారాలుగా కోమాలో ఉన్న ఓ మహిళకు సవాల్‌తో కూడిన అత్యవసర కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను పేస్‌ హాస్పిటల్స్‌ బృందం విజయవంతంగా చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల కిత్రం ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి అక్యూట్‌ హెప్టిక్‌ ఫెయిల్యూర్‌ (తీవ్రమైన కాలేయ సంబంధిత వైఫల్యం) కామెర్లతో నెల రోజులుగా బాధపడుతున్నారు. తొలుత అనారోగ్యంగా ఉండటంతో పాటుగా వైరల్‌ హెపటైటిస్‌ కూడా రావడంతో ఆమె స్ధానికంగా 10 రోజుల పాటు మందులు వాడారు. ఇదే ఆమె ప్రాణాపాయంలో పడటానికి కారణమైంది. స్ధానికంగా మందులను తీసుకోవడంతో ఆమె వైద్య పరిస్థితి మరింత దిగజారింది. కామెర్లు మరింతగా ముదిరిపోయాయి. ఇది ఏకంగా 30ఎంజీ శాతానికి చేరింది. కామెర్లు తీవ్రం కావడంతో ఆమె కోమాలోకి చేరిపోవడంతో పాటుగా తరచుగా మూర్చ రావడం జరిగింది. దీనితో ఆమెను వెంటిలేటర్‌పై పెట్టారు. ఆమె కాలేయం విఫలం కావడంతో పాటుగా ఆమె రక్తంలో ప్లేట్‌లెట్‌లు కూడా పడిపోయాయి మరియు రక్తం గడ్డకట్టడంలో కూడా సమస్యలను ఎదుర్కొంటుంది. ఇలాంటి స్ధితిలో ఆమెను పేస్‌ హాస్పిటల్‌కు అత్యవసరంగా కాలేయ మార్పిడి కోసం తీసుకువచ్చారు.
       ఇది అత్యంత క్లిష్టమైన మరియు సవాల్‌తో కూడిన స్థితి. తీవ్రమైన కాలేయ వైఫల్యంతో పాటుగా ఇన్‌ఫెక్షన్‌, మూర్ఛ సమస్య కూడా ఆమెకు ఉంది. గ్రేడ్‌ 4 కోమాలో ఉండటంతో పాటుగా అత్యధిక బైలిరుబిన్‌ కూడా కలిగి ఉన్నారు. నిమిషం నిమిషానికి ఆమె పరిస్థితి మారిపోవచ్చు మరియు కాలేయ మార్పిడి తరువాత కూడా మృత్యువాత పడేందుకు 50 శాతానికి పైగా అవకాశాలున్నాయని అని డాక్టర్‌ గోవింద్‌ వర్మ, చీఫ్‌ హెపటాలజిస్ట్‌ అన్నారు. ఆయనే మాట్లాడుతూ 'ఈ రోగిని జీవన్‌దాన్‌లో సూపర్‌ అర్జెంట్‌ విభాగంలో నమోదు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు మ్యాచ్‌ అయ్యే కాలేయం లభ్యం కాలేదు. రోగి పరిస్థితి మరింతగా దిగజారుతుండటంతో జీవించి ఉన్న వ్యక్తి కాలేయ మార్పిడి చేయాలని నిర్ణయించాము` అని అన్నారు.
   ట్రాన్స్‌ప్లాంట్‌ అనస్థీషియస్ట్‌ డాక్టర్‌ మంజునాథ్‌ మాట్లాడుతూ.. 'తీవ్రమైన కాలేయ వైఫల్య కేసులలో అతి పెద్ద సవాల్‌గా మారే అంశమేమిటంటే, రోగి పరిశీలన, రోగిని సిద్ధం చేయడం వంటి అంశాలన్నీ చాలా వేగంగా జరగాలి. మార్పిడికి ముందు గోల్డెన్‌ హవర్స్‌ అత్యంత కీలకం. రోగి మెదడులో రక్తస్రావం లేదా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అకస్మాత్తుగా వారు మృత్యువుకు చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి` అని అన్నారు.
     ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఫణి కృష్ణ  మాట్లాడుతూ.. 'శస్త్రచికిత్సకు మునుపు ఆమె బైల్బురిన్‌ చాలా అధికంగా ఉంది. మా హెపటాలజీ బృందం అత్యవరంగా లివర్‌ డయాలసిస్‌ చేసింది. ప్లాస్మా మార్పిడి చేయడం ద్వారా బైలిరుబిన్‌ను 30నుంచి 15కు తీసుకువచ్చారు. అలాగే మెదడు వాపును సైతం తగ్గించారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఇన్‌ఫెక్షన్‌, తీవ్రమైన కోమా వంటి సమస్యలు ఉన్నప్పటికీ అనుక్షణం డాక్టర్లు ఆమెను గమనిస్తూ తగిన చికిత్సనందించడంతో ఆమె శస్త్రచికిత్స నందించేందుకు అవసరమైన వైద్య స్థితికి చేరుకోగలిగారు` అని అన్నారు.
        ఆమె కామెర్లు, మెదడు వాపు నియంత్రించడంతో పాటుగా ఇన్‌ఫెక్షన్‌ను సైతం నియంత్రించిన తరువాత ఆమెకు అత్యవసరంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను పది మంది డాక్టర్లతో కూడిన ట్రాన్స్‌ ప్లాంట్‌ బృందం చేసింది. ఈ బృందంలో డాక్టర్‌ మధుసూదన్‌, డాక్టర్‌ ఫణి కృష్ణ, డాక్టర్‌ మంజునాథ్‌, డాక్టర్‌ గోవింద్‌ వర్మ ఉన్నారు. ఈ రోగి సోదరుడు ఆమెకు తన కాలేయం దానం చేశారు. అతని కాలేయంలో కుడివైపు భాగాన్ని ఆమెకు మార్పిడి చేశారు. అత్యంత సవాల్‌తో కూడిన పరిస్థితులు ఎదురైనప్పటికీ శస్త్ర చికిత్స సజావుగా సాగడంతో పాటుగా శస్త్ర చికిత్స అనంతరం ఆమె కోలుకోగలిగారు. శస్త్ర చికిత్స జరిగిన 12 గంటలలోనే నాటకీయంగా ఆమె కోమా నుంచి పూర్తిగా బయటపడగలిగారు. ఆమె కామెర్లు ఏడు రోజుల్లో తగ్గాయి. శస్త్రచికిత్స అయిన 10 రోజుల తరువాత ఆమె డిశ్చార్జ్‌ అయ్యేందుకు తగిన ఫిట్‌నెస్‌ సాధించగలిగారు.
        ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ మధుసూదన్‌ మాట్లాడుతూ..  'కాలేయ మార్పిడి శస్త్రచికిత్స సమయంలో ఆమెకున్న ఆరోగ్య స్థితిని బట్టి మార్పిడి సజావుగా సాగినప్పటికీ ఈ రోగి కోలుకోవడం అంత త్వరగా వీలుకాకపోవచ్చని భావించాము. కానీ అద్భుతంగా ఆమె అత్యంత వేగంగా కోలుకున్నారు. మరీ ముఖ్యంగా రెండు వారాలు పూర్తిగా కోమాలో ఉండి కోలుకోవడం, శస్త్ర చికిత్స అయిన ఆరు గంటలలోనే ఆమె స్పృహలోకి రావడం మాకు చాలా ఆనందం కలిగించింది` అని అన్నారు.
     రోగి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. 'తీవ్రమైన కామెర్లతో బాధపడుతున్న ఆమె రెండు వారాల పాటు కోమాలో వెంటిలేటర్‌పై ఉండటం చేత దాదాపుగా ఆశలు వదులుకున్నాం. ఆమెపై ఆమె 6 నెలల శిశువు ఆధారపడి ఉంది. పేస్‌ హాస్పిటల్స్‌కు మేము హృదయపూర్వక ధన్యవాదములు చెబుతున్నాము. వేగవంతంగా వారు తీసుకున్న చర్యల కారణంగా ఆమె పునర్జన్మ పొందారు. ఇది అద్భుతం. భగవంతుని ఆశీర్వాదం` అని అన్నారు.
       డాక్టర్‌ గోవింద్‌ వర్మ మాట్లాడుతూ.. 'పేస్‌ వద్ద అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఆరంభించిన తరువాత గత ఆరు నెలల కాలంలో పన్నెండుకు పైగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినప్పటికీ ఈ తీవ్రమైన కాలేయ వైఫల్య కేసు మాత్రం మా లివర్‌ ఐసీయు, హెపటాలజీ, ట్రాన్స్‌ప్లాంట్‌ టీమ్‌ యొక్క సమ్మిళిత ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పుడు వీరు మరింత సవాల్‌తో కూడిన కేసులను సైతం ఎదుర్కొవడానికి అవసరమైన మానసిక స్థైర్యం పొందారు మరియు పేస్‌ను కాలేయ మార్పిడికి అత్యున్నత కేంద్రంగానూ తీర్చిదిద్దగలరు` అని అన్నారు.
         ట్రాన్స్‌ప్లాంట్‌ హెపటాలజిస్ట్‌ డాక్టర్‌ ధీరజ్‌ మాట్లాడుతూ.. 'కామెర్లు వచ్చినప్పుడు అనవసరంగా స్థానికంగా లభించే మందులను వాడకూడదనే హెచ్చరికను ఈ రోగి యొక్క కేసు మరింత ప్రస్ఫుటంగా వెల్లడిస్తుంది. చాలా వరకూ వైరల్‌ హెపటైటిస్‌ సమస్యలు ఎలాంటి సమస్యలు లేకుండా నయమవుతాయి. అయితే భయపడి ప్రత్యామ్నాయమార్గాలను అనుసరించే వారిలో ఒక్కోసారి పరిస్థితి దిగజారవచ్చు. మరీ ముఖ్యంగా కామెర్లతో బాధపడుతున్న రోగులలో ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. ఇది కాలేయ నష్టాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ స్థితిని డిలి (డ్రగ్‌ ఇండ్యూస్డ్‌ లివర్‌ ఇంజురీ)గా వ్యవహరిస్తుంటాం. లివర్‌ ఐసీయు రోగులలో చేరికలు మరియు మరణాలకు అతి సహజమైన కారణంగా ఇది నిలుస్తుంది` అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.