Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పసిడి, అభరణాల రీసైక్లింగ్ సంస్థ డ్రూ గోల్డ్ కొత్తగా మరో 50 శాఖలు తెరువనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం తమకు తెలుగు రాష్ట్రాల్లో 20 శాఖలున్నాయని ఆ సంస్థ సిఇఒ అకిలేష్ అగర్వాల్ తెలిపారు. 2023-24 నాటి కల్లా కర్నాటక, తమిళనాడు, కేరళలో మరో 50 కేంద్రాలను తెరువనున్నామన్నారు. బంగారం విలువ కట్టడం మొదలుకుని నగదు ప్రక్రియ వరకు వినియోగదారులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా తాము సేవలు అందిస్తున్నామన్నారు. పసిడి రుణాలను ప్రాసెస్ చేయడానికి ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామన్నారు.