Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ) కో- లొకేషన్ కుంభకోణం కేసులో చిత్ర రామకృష్ణకు ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ అయినా చిత్ర, మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణి యన్ ఇరువురు స్టాక్ ఎక్సేంజీకి సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసిన వ్యవహారం బయటికి రావడంతో సీబీఐ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. విచారణ సమయంలో తనకు వీఐపీ సౌకర్యాలు కల్పించాలని చిత్ర కోర్టును కోరగా.. న్యాయమూర్తి తిరస్కరించారు.