Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీ సింక్రోనీ తమ ఉద్యోగులందరికీ శాశ్వ తంగా ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణ యం, ఉద్యోగులు, వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే నిబద్దతకు నిదర్శనమని పేర్కొంది. అందరికీ అనుకూలమైన పని వాతావరణాన్ని సైతం ప్రోత్సహిస్తున్నట్లు సింక్రోనీ బిజినెస్ లీడర్ ఇండియా ఎస్విపి ఆండీ పొన్నేరీ తెలిపారు. సింక్రోనీలో ప్రస్తుతం 47 శాతం మహిళా ఉద్యోగులు, 100 మందికి పైగా దివ్యాంగులు పని చేస్తున్నారు.