Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్షిణ భారతదేశంలో తమ ఓమ్నీ ఛానెల్ ఉనికి బలోపేతం చేస్తోంది
ఆంధ్రప్రదేశ్ : ఈ–కామర్స్ ఫర్నిచర్, గృహ ఉత్పత్తుల కంపెనీ పెప్పర్ఫ్రై , ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వద్ద తమ మొదటి స్టూడియో ప్రారంభించినట్టు వెల్లడించింది. ఈ ఆఫ్లైన్ విస్తరణ, సముచిత మార్కెట్లలో విస్తరించడంతో పాటుగా భారతదేశంలో ఫర్నిచర్, గృహ ఉత్పత్తుల విభాగంలో అతిపెద్ద ఓమ్నీ ఛానెల్ వ్యాపారాన్ని సృష్టించాలనే కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. పెప్పర్ఫ్రై కు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 100కు పైగా నగరాలలో 200కు పైగా స్టూడియోలు ఉన్నాయి.
భారతదేశంలో ఫర్నిచర్ రిటైల్ ల్యాండ్స్కేప్ను సమూలంగా పెప్పర్ఫ్రై స్టూడియోస్ మార్చింది. ఈ కంపెనీ ఓమ్నీ ఛానెల్ వ్యూహానికి దేశవ్యాప్తంగా ఫోఫో స్టూడియోల విస్తరణ తోడ్పాటునందిస్తుంది. ప్రస్తుతం ఇది 90కు పైగా వినూత్న భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది. ఈ స్టూడియోను శ్రీ వాసవి స్టీల్ అండ్ సిమెంట్స్ భాగస్వామ్యంతో ప్రారంభించారు. తిరుపతిలోని అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతం ఏకె పల్లి రోడ్, మంగళం రోడ్, శ్రీరామ్ నగర్, తిరుపతి వద్ద ఇది 1110 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది వినియోగదారులకు విస్తృత శ్రేణి ఫర్నిచర్, హోమ్ ప్రొడక్ట్ తొలి అనుభవాలను అందిస్తుంది. ఈ స్టూడియోలో డిజైన్ నిపుణులు కూడా ఉండటం వల్ల , ప్రత్యేకమైన డిజైన్ సలహాలను సైతం పొందవచ్చు. తిరుపతి లోని ఈ స్టూడియో ద్వారా ఆంధ్రప్రదేశ్లోని గృహ, లివింగ్ వినియోగదారుల వినూత్న అవసరాలను తీర్చేందుకు వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాలను సైతం అందిస్తారు.
ఈ స్టూడియో ప్రారంభం గురించి పెప్పర్ ఫ్రై బిజినెస్ హెడ్ - ఫ్రాంచైజింగ్ అండ్ అలయెన్సస్ , అమృత గుప్తా మాట్లాడుతూ 'శ్రీ వాసవి స్టీల్ అండ్ సిమెంట్స్ తో భాగస్వామ్యం చేసుకుని తిరుపతిలో మా మొదటి స్టూడియోను ప్రారంభించడం ద్వారా మా ఓమ్నీ ఛానెల్ కార్యకలాపాలను విస్తరించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. పెప్పర్ ఫ్రై ఫ్రాంచైజీ సొంతం చేసుకోవడం వ్యాపారపరంగా విజయం సాధించడం మరియు మేము వినియోగదారులను మెట్రోపాలిటన్ ప్రాంతాలలో మాత్రమే కాకుండా టియర్ 1 నగరాలలో కూడా చేరుకోవాలనుకుంటున్నాము. మా ఫ్రాంచైజీ భాగస్వాములలో విజయవంతమైన వ్యాపారవేత్తలు, మహిళా వ్యాపారవేత్తలు, మాజీ ఆర్మీ అధికారులు, తొలిసారి వ్యాపార రంగంలో అడుగుపెట్టిన వారు ఉన్నారు. నేడు అధికశాతం మా పెప్పర్ ఫ్రై వినియోగదారులు ఏఆర్ మరియు వర్ట్యువల్ ప్రొడక్ట్ ఇంటరాక్షన్స్ పై ఆధారపడి సంభాషణలు చేస్తున్నారు. ప్రపంచమంతా ఇల్లే అనే భావనను ప్రతి ఒక్కరిలోనూ రేకిత్తించే లక్ష్యంతో మేము మహోన్నతమైన వినియోగదారుల సేవలను స్ధిరంగా అందించడానికి ప్రయత్నిస్తున్నాము` అని అన్నారు.
తిరుపతిలోని పెప్పర్ ఫ్రై ఫ్రాంచైజీ స్టూడియో యజమాని మనోజ్ మాట్లాడుతూ 'భారతదేశంలో సుప్రసిద్ధ హోమ్, ఫర్నిచర్ మార్కెట్ ప్రాంగణం పెప్పర్ఫ్రైతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. పూర్తి వైవిధ్యమైన ఓమ్నీ ఛానెల్ వ్యాపారం పెప్పర్ ఫ్రై. అతి పెద్ద ఓమ్నీఛానెల్ గృహ, ఫర్నిచర్ వ్యాపారం సృష్టించాలనే వారి ప్రయాణంలో చేరడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము` అని అన్నారు.
వినూత్నమైన ఫ్రాంచైజీ మోడల్ను 2017లో పెప్పర్ ఫ్రై పరిచయం చేసింది. దీనిద్వారా ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్, అమ్మకం తరువాత సేవలను పెప్పర్ ఫ్రై అందిస్తుంది. అలాగే స్టూడియో డిజైన్,ఆవిష్కరణ, సెటప్, నిర్వహణ మార్గనిర్దేశకత్వం, మార్కెటింగ్, ప్రొమోషన్స్ను పెప్పర్ఫ్రై చేస్తుంది. పెప్పర్ ఫ్రై ఆ ప్రాంతాలలో అత్యుత్తమ స్థానిక వ్యాపారులతో భాగస్వామ్యం చేసుకోవాలని నిర్ణయించుకుంది. హైపర్ లోకల్ డిమాండ్, ధోరణుల పట్ల వీరికి పూర్తి అవగాహన ఉంది. ప్రతి నెలా 8–9 ఫ్రాంచైజీలను పెప్పర్ ఫ్రై ప్రారంభిస్తోంది.
పెప్పర్ ఫ్రై తమ పెప్పర్ ఫ్రై యాక్సలరేటర్ కార్యక్రమాన్ని జూన్ 2021లో ప్రారంభించింది. దీనిద్వారా పెప్పర్ ఫ్రై ఆఫ్లైన్ పాదముద్రికలను గణనీయంగా విస్తరించనున్నారు. ఈ నూతన కార్యక్రమంలో అతిపెద్ద వైవిధ్యత ఏమిటంటే, ఫ్రాంచైజీ భాగస్వాములకు కాపెక్స్ అవసరం పడటం. అది దాదాపుగా 15లక్షల రూపాయలు ఉంటుంది. ఈ నమూనా 100% ప్రైస్ పారిటీ ఆధారంగా ఉంటుంది మరియు ప్రొడక్ట్ ఇన్వెంటరీ పెట్టుకోవాల్సిన అవసరం భాగస్వామికి ఉండదు. ఇది పరస్పర ప్రయోజనకరమైన వ్యాపార భాగస్వామ్యంగా నిలుస్తుంది.