Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఢిల్లీ చాందినీచౌక్లోని భగీరథ ప్యాలెస్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. 32పైరింజిన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు సిబ్బంది. రిమోట్ కంట్రోలుతో పనిచేసే అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించామని ఢిల్లీ అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో చాందినీచౌక్లోని ప్రధాన భవనం దెబ్బతిన్నట్టు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ఘటనా స్థలాన్ని డాక్టర్ హర్షవర్థన్ సందర్శించారు. మంటలను అదుపు చేస్తున్నామని, ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని హర్షవర్థన్ వెల్లడించారు.