Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: విమానాశ్రయాల్లో తనిఖీలు అత్యంత పకడ్బందీగా ఉన్న కూడా ఏదో ఒక దారిలో అక్రమంగా మాదకద్రవ్యాలు, బంగారం తరలిస్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని విమానాశ్రయంలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 8 కిలోలు డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.