Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలకు సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. నాలుగేళ్లుగా ఒకే పోస్టులో కొందరు ఐఏఎస్లు ఉండడంతో ఏ క్షణం ఐనా అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణలో ఎన్నికలకు ఏడాది ముందు కేసీఆర్ పాలన ప్రక్షాళన నిర్వహిస్తున్నారు. బదిలీల తర్వాత కేసీఆర్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఒక్కొక్కరికీ రెండు కన్నా ఎక్కువ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జి కలెక్టర్లను నియమించనున్నారు.