Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇండ్ల పట్టాలు మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నారని అన్నారు. 300 మందికి నేడు పట్టాలు పంపిణీ చేస్తున్నాం, త్వరలోనే అందరితో కలిసి సామూహిక గృహ ప్రవేశం చెద్దామన్నారు. ఈ ఇండ్లు సుమారు 20 లక్షల రూపాయిలు విలువ ఉంటాయని అన్నారు. త్వరలోనే మరో వెయ్యి ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. ఇవి ఎవరు అమ్మకూడదన్నారు. దళిత బందులో కూడా జర్నలిస్ట్ లకు అవకాశం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గతంలో లబ్ది పొందని పేద జర్నలిస్టుల కోసం మూడు బ్లాక్ లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దళిత బందు లో కూడా జర్నలిస్ట్ లకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. స్వంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి త్వరలోనే నిధులు ఇస్తామని మంత్రి హరీష్ రావు తెలియజేశారు.