Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం నలుగురు ఐఏఎస్లను బదిలీలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి కొత్త సీఎస్గా జవహర్రెడ్డిని నియమించిన కొద్ది నిమిషాల తేడాలోనే రాష్ట్రంలోని మరికొందరిని బదిలీలు చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక సీఎస్గా పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్గా మధుసూదన్రెడ్డి, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, ఆర్ అంబ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్గా రాహుల్ పాండేను, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాస్ను నియమించింది.