Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'ప్రగతి ఐఐటీ, నీట్‌ అకాడమి' స్కాలర్‌షిప్‌ పరీక్ష ఏప్రిల్‌ 3 | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 19,2022

'ప్రగతి ఐఐటీ, నీట్‌ అకాడమి' స్కాలర్‌షిప్‌ పరీక్ష ఏప్రిల్‌ 3

- ప్రతిభావంతులకు ఫీజు రాయితీ
- సబ్జెక్టు పట్ల రాజీపడొద్దు : చుక్కా రామయ్య
- యంత్రాలుగా మారుస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థలు : నర్సిరెడ్డి
- పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం : దయాకర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           ప్రగతినగర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో 'ప్రగతి ఐఐటీ-జేఈఈ, నీట్‌ అకాడమి' స్కాలర్‌షిప్‌ పరీక్ష వచ్చేనెల మూడో తేదీన జరగనుంది. హైదరాబాద్‌లో ప్రగతినగర్‌లో ఉన్న ప్రగతి సెంట్రల్‌ స్కూల్‌లో, మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు https://pragathicollege.co.in  వెబ్‌సైట్‌ను సంప్రదించి వచ్చేనెల మూడో తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశమున్నది. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ఐఐటీ ప్రశ్నాపత్రంలో ప్రశ్నలను ఎలా తిప్పి అడుగుతారో ఖరగ్‌పూర్‌ ఐఐటీకి వెళ్లిన తర్వాత అర్థమైందన్నారు. సబ్జెక్టులో ఉండే రహస్యాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. అప్పుడే విద్యార్థులు ప్రశ్న ఎలా వచ్చినా జవాబు రాయగలరనీ, వారి మేధస్సు బయటపడుతుందని అన్నారు. ప్రశ్నలోని చిక్కుముడులను విప్పేలా వారిని తీర్చిదిద్దాలని చెప్పారు. సబ్జెక్టును చెప్పడంలో, ప్రతిభ ఉన్న విద్యార్థులను చేర్చుకోవడంలో రాజీపడొద్దని కోరారు. పునాది సరిగ్గా లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతం, పేద విద్యార్థులు ఎక్కువ మంది ఐఐటీకి ఎంపికయ్యే వారు కాదన్నారు. విద్యార్థుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలనీ, పేద విద్యార్థులకు న్యాయం జరగాలని కోరారు. వారు దేశానికి, సమాజానికి ఉపయోగపడతారని అన్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రయివేటు విద్యాసంస్థలు అందిస్తున్నది విద్యేనా?అన్న ప్రశ్న వస్తున్నదని చెప్పారు. పాఠ్యాంశాలే కాకుండా సమాజాన్ని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. కానీ కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యార్థులను జీవం ఉన్న యంత్రాలుగా మార్చి పుస్తకాలు, పరీక్షలు, మార్కులు, ర్యాంకుల కోసమే చదవాలన్నట్టుగా తయారు చేస్తున్నారని వివరించారు. ఇంటర్‌ విద్య చాలా కీలకమని అన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్‌ విద్య అందించేందుకు ప్రగతినగర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. నాణ్యమైన విద్యను అందించి నిజమైన పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్పొరేట్‌ విద్యావ్యాపారం మూడు పువ్వులు, పదహారు కాయలుగా వికసిస్తున్నదని చెప్పారు. కమీషన్లు అందుతున్నాయేమో, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అంతర్గత భాగస్వాములేమో అన్న అనుమానాలున్నాయని అన్నారు. ఏడేండ్ల కింద, అధికారంలోకి వచ్చాక మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమని వివరించారు. ప్రగతినగర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కరస్పాండెంట్‌ డి దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రగతి సెంట్రల్‌ స్కూల్‌లో సీబీఎస్‌ఈ, రాష్ట్ర సిలబస్‌ను బోధిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు 600 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామనీ, రాబోయే 15 ఏండ్లలో 25 వేల మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని చెప్పారు. ప్రతి గ్రామం ఓ పేద విద్యార్థికి విద్య అందిస్తామన్నారు. ఇప్పుడు నాలుగు జూనియర్‌ కాలేజీలను ప్రారంభిస్తున్నామనీ, భవిష్యత్తులో డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాలేజీలను ప్రారంభిస్తామని అన్నారు. విలువలతో కూడిన ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రగతి ఐఐటీ, నీట్‌ అకాడమి అకడమిక్‌ డైరెక్టర్‌ సాంబశివరావు, జనరల్‌ మేనేజర్‌ టి నరేష్‌ చెప్పారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఫీజులో రాయితీ కల్పిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా మొదటి మూడు ర్యాంకులు సాధించిన వారికి 90 శాతం, ఆ తర్వాత వారి ప్రతిభ, నేపథ్యం ఆధారంగా ఫీజు రాయితీ ఉంటుందని వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.