Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేంద్రంపై కొట్లాడాల్సిందే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 21,2022

కేంద్రంపై కొట్లాడాల్సిందే

- అంబానీ, అదానీ, టాటా ఎక్స్‌ప్రెస్‌లొస్తారు
- ఎల్‌ఐసీ, రైల్వే, రోడ్ల ప్రయివేటీకరణ దుర్మార్గం
- 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మెకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు:
టీఆర్‌ఎస్‌కేవీ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో బోయినపల్లి వినోద్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అడగనిది ఎవ్వరూ చేయరనీ, కార్మికులు తమ హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సిందేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ నొక్కి చెప్పారు. రైల్వే వ్యవస్థ ప్రయివేటీకరణకు పూనుకోవడం అన్యాయన్నారు. దీనిపై పోరాడకుంటే అంబానీ, ఆదానీ, టాటా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వస్తాయని హెచ్చరించారు. ఎల్‌ఐసీ, రైల్వే, రోడ్లు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు, కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 28,29 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆదివారం మంత్రుల నివాస సముదాయంలో టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో కార్మిక, ప్రభుత్వ రంగ సంస్థల యూనియన్ల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్‌ అధ్యక్షత వహించారు. పెట్టుబడిదారులు, మల్టీనేషనల్‌ కంపెనీలు, ప్రపంచ బ్యాంకు చెప్పే ఆదేశాల మేరకు మోడీ సర్కారు నడుస్తున్నదనీ, అందులో భాగంగానే కార్మిక కోడ్లను తెచ్చిందని విమర్శించారు. గతంలో హెచ్‌పీ, ఐఓసీ లాంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థల ముందు రిలయెన్స్‌ లాంటి సంస్థలు తట్టుకోలేక మూతపడ్డాయని గుర్తుచేశారు. అదే రకంగా ఇన్సూరెన్స్‌ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌, ఐసీఐసీఐ లాంటి పది ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఎల్‌ఐసీ సేవల ముందు నిలవలేకపోయాయన్నారు. బలంగా పోటీలో నిలబడిన ప్రభుత్వ రంగ సంస్థలను బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా దొంగచాటున నిర్వీర్యం చేసే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా అమ్మేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు తీసుకుంటున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో విద్యుత్‌ కొరత నివారించేందుకు ఆదానీ, జిందాల్‌ లాంటి సంస్థల నుంచి కొనుగోలు చేయాలనే సూచన రాగా సీఎం కేసీఆర్‌ తిస్కరించారని గుర్తుచేశారు. రాష్ట్ర సర్కారు ప్రభుత్వ రంగంలోనే ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్‌ను తయారు చేస్తున్నదని చెప్పారు. వాటికి కావాల్సిన పంపులు, మోటార్లు, టర్బన్ల ఆర్డర్లనూ బెల్‌ సంస్థకు ఇచ్చామని గుర్తుచేశారు.
          ఏఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ బోస్‌ సంపద ఒక దగ్గర పోగుపడకుండా చూడాలని రాజ్యాంగం చెబుతుంటే మోడీ సర్కారేమో కొందరు చేతిల్లోకే చేరేలా విధాన పర నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలకు పూనుకున్న తీరును వివరించారు. రాష్ట్రంలో కోటి మందికిపైగా సమ్మెలో పాల్గొనేలా అందరూ కృషి చేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ మాట్లాడుతూ..సింగరేణి, ఆర్టీసీ, బెల్‌, బీడీఎల్‌, తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో పూర్తిస్థాయిలో సమ్మె జరిగేలా టీఆర్‌ఎస్‌ సహకరించాలని కోరారు. స్కీమ్‌వర్కర్లందరూ సమ్మెలో పాల్గొనేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థల మనుగడే ప్రశ్నార్థకమవుతుంటే ఒక్కరోజు జీతం పోతుందనే నెపంతో కొందరు సమ్మెకు దూరంగా ఉండటం సరిగాదని సూచించారు. కార్మికుల హక్కులు, దేశ సంపదను కాపాడుకోవడం కోసం జరుగుతున్న దేశభక్తియుత సమ్మెను ప్రతిఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్య క్షులు రాంబాబు యాదవ్‌ మాట్లాడుతూ..ఓ పక్క కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను పెంచుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం తగ్గిస్తూ పోతున్నదని విమర్శించారు. ప్రయి వేటు సంస్థల్లోకి కార్మికులు సమ్మెలో పాల్గొనకపోతే రానున్న కాలంలో వాళ్లకు జరుగబోయే నష్టాలను విడమర్చి చెప్పి చైతన్యపర్చాలన్నారు. పబ్లిక్‌ సెక్టార్‌లో సమ్మె జయప్రదానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ..ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, కార్మిక కోడ్ల విషయంలో కేంద్రం గుడ్డిగా ముందుకెళ్తూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే చర్యలకు ఉపక్రమించిందని విమర్శించారు. కార్మిక సంఘాలన్నీ కలిసికట్టుగా ముందుకుసాగితే వంద శాతం సమ్మె జయప్రదం అవుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐఐఈఏ హైదరాబాద్‌ జోనల్‌ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, సౌత్‌సెంట్రల్‌ జోనల్‌ కార్యదర్శి రవీంద్రనాధ్‌, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర నాయకులు శ్రీను, వి.దానకర్ణాచారి, ఎల్‌.రూప్‌సింగ్‌, మచ్చ నర్సిం హులు, ప్రభుత్వ రంగ సంస్థల యూనియన్ల నాయకులు బి.చంద్రయ్య(ఏఐడీఈపీ), సత్తయ్య (బీడీఎల్‌), యాదవరెడ్డి(రైల్వే రంగం), భాస్కర్‌రెడ్డి (ఈసీఐఎల్‌), విజరుకుమార్‌(బీడీఎల్‌), జీవన్‌కు మార్‌(హెచ్‌ఎఎల్‌), సత్యనారాయణ (హెచ్‌ఈఎల్‌), జె.రాఘవరావు(బీఈఎల్‌), శ్రీకాంత్‌, వేముల మారయ్య(ట్రాన్స్‌పోర్టు రంగం) తదితరులు మాట్లాడారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.