Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీతోనే అసమానతలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 23,2022

బీజేపీతోనే అసమానతలు

- 15 కోట్ల భారతీయుల రోజువారీ ఒక్కొక్కరి ఆదాయం రూ.140
- ఒక్కో కార్పొరేట్‌ సంస్థ యజమాని ఆదాయం రోజుకు రూ.1000 కోట్లు
- భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు రావెళ్ల సత్యం
- పార్టీలు మారి ప్రజాతీర్పును అపహాస్యం చేసిన ఎమ్మెల్యేలు
- 28, 29న భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వాలి..: బృందాకరత్‌
- ధరణి సమస్యలపై సర్వేలు.. ఆపై ప్రజా ఉద్యమాలు: తమ్మినేని
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
       బీజేపీ హయాంలో దేశంలో మరింతగా అసమానతలు పెరిగాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. ప్రపంచంలో అసమానతలు అత్యధికంగా మన దేశంలోనే ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు. కరోనా సమయంలో ఒక్కో నిరుపేద ఆదాయం రోజుకు రూ.140 చొప్పున ఉంటే.. ఒక్కో కార్పొరేట్‌ సంస్థ యజమాని ఆదాయం రోజుకు రూ.వెయ్యి కోట్లని తెలిపారు. దేశంలో 25% జనాభా విద్య, ఆరోగ్యం, పౌరహక్కులు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పార్టీ నూతన కార్యాలయం (రావెళ్ల సత్యం భవనం) ప్రారంభం సందర్భంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 28, 29న నిర్వహించనున్న భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అకస్మాత్తుగా సీఎం కేసీఆర్‌కు జ్ఞానోదయమై ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపడం ఆహ్వానించదగిన పరిణామం అయినా.. కేరళ సీఎం విజయన్‌ తరహాలో అన్ని పక్షాల నాయకులను పంపించి ఉండాల్సిందన్నారు. ప్రజలు, రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ పోరాడాలన్నారు.
కేరళలో జరగనున్న సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభలో కార్మిక, కర్షకుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై చర్చిస్తామన్నారు. ఓట్లు, సీట్ల కోసం వెంపర్లాడే పార్టీలకు కాకుండా.. ప్రజా సమస్యలపై నిఖార్సైన పోరాటాలు చేసే కమ్యూనిస్టులకు పట్టం కట్టాలన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజలు బీజేపీ, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చివరకు ఆ ఎమ్మెల్యే పార్టీ మారి ప్రజా తీర్పును అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 15 కోట్ల భారతీయులు రోజుకు ఒక్కొక్కరు రూ.140 సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటమే కాదు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో పోరాడిన వీరవనిత మల్లు స్వరాజ్యం అన్నారు. త్యాగం కమ్యూనిస్టుల వారసత్వం అంటూ రావెళ్ల సత్యం కూతురు వెంకటలక్ష్మిని సభకు పరిచయం చేశారు. ఒంటిచేత్తో రావెళ్ల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం అన్నారు. పేదలు, శ్రామికులు, భూములు లేని నిరుపేదల పక్షాన నిబద్దత రావెళ్ల పోరాటం చేశారన్నారు. అణగారినవర్గాలు, సాంఘిక న్యాయం కోసం ప్రాణత్యాగం చేశారని చెప్పారు. బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక ఆధిపత్య ధోరణకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు నిర్వహిస్తున్న పోరాటాలకు కలిసి రావాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీపీఐ(ఎం) పోరాట ఫలితమే సీతారామ.. : తమ్మినేని
       ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ఎత్తిపోతల పథకం కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ధరణి భూ సమస్యలపై మూడునెలల పాటు సర్వేలు నిర్వహించి.. ఆపై ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. రాజ్యాంగ మూలసూత్రాలకు మోడీ తిలోదకాలు ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రభుత్వ రంగాల్లో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కేవలం 90వేల ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దళితులకు ఇచ్చిన హామీల్లో కేసీఆర్‌ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించే పోరాటాల్లో కేసీఆర్‌ అందర్నీ కలుపుకుపోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేశ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, టి.జ్యోతి, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, యర్రా శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, వై.విక్రమ్‌, బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నేలకొండపల్లి మండల కార్యదర్శి కేవీ రాంరెడ్డి ఆహుతులను వేదిక మీదకు ఆహ్వానించారు. మండల కార్యదర్శివర్గ సభ్యులు పగిడికత్తుల నాగేశ్వరరావు వందన సమర్పణ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.