Authorization
Fri April 11, 2025 07:46:58 pm
ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్
నవతెలంగాణ-ధూల్పేట్
ప్రజారోగ్యంపై ప్రభుత్వం అవగాహన కల్పించాలని ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ అన్నారు. గురువారం ఆవాజ్ నగర కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీలకు టీబీపై అవేర్నెస్ ప్రొగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రజలు ముఖ్యంగా మైనార్టీ కార్మికులు అనారోగ్యానికి గురయ్యారన్నారు. అడ్డా కార్మికుల ఆరోగ్య స్థితిగతుల గురించి సర్వే నిర్వహించి సరైన మందులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం డాక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ రెండు వారాల పాటు దగ్గు, జ్వరం ఉన్న వాళ్లకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆవాజ్ నాయకులు అన్వర్ ఖాన్, అక్తర్ బేగం, మహమ్మద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.