Authorization
Fri April 11, 2025 07:48:15 am
నవతెలంగాణ-ఉప్పల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్చ డీజిల్పై ఉన్న వ్యాట్ను వెంటనే తగ్గించాలి అని ఓబీసీ మోర్చా మేడ్చల్ అధికార ప్రతినిధి కొల్లు బాలరాజు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల కోసం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్పై వ్యాట్ ను తగ్గించే వరకు పోరాటం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.