Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడలోని 2వ డివిజన్లో మిషన్ భగీరథ పథకం ద్వారా సరపరా చేసే పైపులైన్ డయాను పెంచాలని కోరుతూ శనివారం హెచ్ఎండబ్యూఎస్ అధికారులకు రెండో డివిజన్ కార్పొరేటర్ జెనిగే పద్మ ఐలయ్య యాదవ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్మాస్గూడ గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఆనాడు ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రెండున్నర ఇంచుల డయా ఉన్న పైపులైన్ నిర్మాణం చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం జనాభా పెరుగటంతో ప్రజలకు నీటి సమస్య ఏర్పడిందనీ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతనంగా నాలుగు ఇంచుల డయా పైపులైన్ నిర్మాణం చేసి ప్రజలను ఆదుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.