Authorization
Fri April 11, 2025 07:24:26 pm
నవతెలంగాణ-హైదరాబాద్
బోయిన్పల్లి ఒకటో వార్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి బ్రహ్మౌత్సవాలు జరుగుతున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి సొంత నిధులతో రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు చేయించారు. బోర్డు పరంగా నిధులు మంజూరు కావడానికి జాప్యం జరుగుతున్న తరుణంలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు గమనించి సొంత నిధులతో ప్యాచ్ వర్క్ పని చేయించినట్టు ఆయన తెలిపారు.