Authorization
Mon April 07, 2025 10:33:00 pm
వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్ నగర్ డివిజన్ లోని ప్రతి బస్తీని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తున్నామని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు. గురువారం వినాయక్ నగర్ లైన్ నెంబర్ 18, 26లో చేపడుతున్న నూతన రోడ్డు పనులను, భూగర్భ డ్రయినేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలతో డివిజన్ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్సాగర్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఓం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఆర్.మణి రత్నం, సాయి సురేష్, రాంప్రసాద్, సుశీల, సూర్యకాంత్, దినకర్, అరుణ్, మహేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.