Authorization
Sat April 05, 2025 05:24:36 pm
నవతెలంగాణ-కాప్రా
నందీశ్వర ఆలయంలోని కళ్యాణ మండపం నిర్మాణం కోసం ప్రకటించిన విరాళాలను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సమక్షంలో దాతలు ఉమా మల్లేష్ (ఆలేరు) రూ.51వేలు, సీతల వీరస్వామి రూ.30 వేలు, చీగుల మల్లేష్ రూ.11 వేలు, కప్పర సాయి గౌడ్ రూ.11 వేలు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహరిగౌడ్, నాగరాజు, వాసుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.