Authorization
Wed March 26, 2025 05:30:41 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ బస్తీలో ఎల్వీ ప్రసాద్ వెనుక వైపు డ్రయినేజీ పనులపై వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ రాంబాబు, వర్క్ ఇన్స్పెక్టర్ హఫీజ్, బీజేపీ నాయకులు గడ్డం వెంకటస్వామి, మల్లేష్ యాదవ్, పుంటి పాల్గొన్నారు.