Authorization
Thu March 20, 2025 11:51:37 pm
- నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-బంజారాహిల్స్
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదనీ, మరోచోటికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, బోలానగర్, ఖాజానగర్ మంత్రుల నివాసం వద్ద పర్యటించిన మేయర్ దాదాపు రూ.18 లక్షలతో నిర్మిస్తున్న మంచినీరు, మురుగునీటి పైపులైన్ పనులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మంచినీటి, మురుగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించ డమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంద న్నారు. నగరంలో ఏదైనా పని ప్రారంభించి వదిలివేయకుండా నిధులు వెంటనే విడుదల చేసి ప్రజా అభివృద్ధికి దోహదపడుతుందన్న ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. ప్రజల కనీస అవసరాలను గుర్తించి ప్రతి పనికీ నిధులు వెంటనే మంజూరు చేస్తున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.