Authorization
Wed March 19, 2025 05:21:58 am
నవతెలంగాణ-అంబర్పేట
చే నెంబర్ రామాలయం కమాన్ కోసం సరైన పద్దతిలో గుంతలు తవ్వకపోవడంతో డ్రయినేజీ పైపులు పగిలాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. స్ధానికుల ఫిర్యాదుతో మంగళవారం పగిలిన పైపులైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పగిలిన డ్రయినేజీ పైపులైన్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని జల మండలి అధికారులను కోరారు. కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ బి.వెంకటరెడ్డి, బాగ్ అంబర్పేట డివిజన్ ప్రధాన కార్యదర్శి జమ్మిచెట్టు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.