Authorization
Wed March 19, 2025 07:09:19 am
- అధ్యక్షులు రమేష్రెడ్డి
నవతెలంగాణ-సంతోష్నగర్
దుర్గాభవానినగర్ పరిధిలోని నెలకొన్న డ్రయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని, కాలనీలో నెలకొన్న డ్రయినేజీ మరమ్మతులను చేపట్టారు. ఆదివారం పారిశుధ్య కార్మికులతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కాలనీ స్థానిక నాయకులతో కలిసి పరిశీలిస్తూ మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రమేష్రెడ్డి మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న సమస్య వల్ల తలెత్తిన సమస్యను స్థానికుల విజ్ఞప్తి మేరకు పరిశీలించి హెచ్ఎండబ్ల్యుఎస్ ఎస్బి ఎయిర్ టెక్ మిషన్ ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు.
భవిష్యత్తులో పునరావతం కాకుండా చర్యలు తీసుకునే విధంగా ప్రతివాడలో మురుగునీరు మరమ్మతులు చేస్తూ డ్రైనేజీ ప్రవాహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా తీసుకోవలసిన చర్యలపై అధికారులకు చర్చించడం జరిగిందన్నారు. నిరంతరం పర్యవేక్షణతో త్వరితగతిన పనులు పూర్తిచేసి, 1991-92లో మొదటిసారిగా వేసిన డ్రైనేజీ పూర్తిగా దెబ్బతింది. సమస్య పరిష్కారానికి 100 ఫీట్ పొడవున కొత్త డ్రైనేజీ వ్యవస్థకు కలపాని సమస్యకు పరిష్కారం చూపిస్తామని రమేష్ రెడ్డి తెలిపారు. కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్డు, మంచినీరు, విద్యుత్ దీపాలు, వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆయన చెప్పారు. డిబి నగర్ కాలనీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూనని, మెరుగైన ప్రజా జీవనాన్ని అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని, కాలనీని ఆదర్శవంతమైన డిబి నగర్గా తీర్చిదిద్దుతానని అధ్యక్షులు పునరుద్ఘాటించారు.
స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు కోరారు. విద్యుత్ పోల్కు పొంచి ఉన్న ప్రమాదాల మరమ్మతులను చేయాలని తీసేయాలని విద్యుత్ శాఖ అధికారులకు అధ్యక్షులు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వైస్ ప్రెసిడెంట్ వెంకట్, స్థానికులు నాయకులు అభిమానులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.