Authorization
Wed March 19, 2025 06:57:22 am
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి పరిధిలో 33 /11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని కీసర మండల ట్రాన్స్ కో అధికారి అనిల్ తెలిపారు. రాంపల్లి పరిధిలోని రామాలయం కరీం గూడా ఆర్టీసీ కాలనీ ఆర్ఎల్ నగర్ అయ్యప్ప నగర్ కాలనీ నీలగిరి శిరిడి సాయి నగర్ రఘువీర్ నగర్ శాస్త్రి నగర్ రోజు ప్రైడ్ హెల్ప్ ఎంక్లేవ్ కరీం కూడా ప్రజాసాయి గార్డెన్ ఆర్టీసీ కాలనీ ఓయూ కాలనీ రెకిల్ కోడ్డు, మధుర నగర్ కాలనీ భరత్ నగర్ కాలనీ చర్లపల్లి గణేష్ నగర్ భరత్ నగర్ సూర్య నగర్ ఏవన్ డౌన్ తదితర కాలనీల్లో కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు.