Authorization
Wed March 19, 2025 05:46:29 am
నవతెలంగాణ-బాలానగర్
సైబరాబాద్ కమిషనరేట్, బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచశీల కాలనీలో సోమవారం జరిగింది. మధ్యాహ్నం పూట శ్రీనివాసులు (40) రోజువారిలాగే తన పనిలో నిమగమై ఉండగా కాలు కింద నుండి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో కాలికి తీవ్ర గాయమైంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం శ్రీ శక్తి ఎంటర్ ప్రైజెస్లో స్క్రాప్ డీసీఎంలో లోడింగ్ చేసే పనిలో నిమగమైన వ్యక్తి శ్రీనివాసులుగా గుర్తించారు. తిరుమల ఫైబర్ ఇండిస్టీస్ వద్ద పార్క్ చేసిన డీసీఎంలో లోడ్ చేస్తుండగా భూగర్భంలో నుంచి గుర్తు తెలియని పదార్థంలో పేలుడు సంభవించింది. దీంతో శ్రీనివాసులు ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. గాయపడిన శ్రీనివాసులును ఆస్పత్రికి తరలించారు. బాలానగర్ పోలీసులు క్లూస్ టీమ్తో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.