Authorization
Wed March 19, 2025 05:21:49 am
నవతెలంగాణ-కల్చరల్
దేవీ నవరాత్రులు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ నిర్వహణలో నాలుగు రోజుల పాటు జరిగే దేవి వైభవ్ నృత్యోత్సవ్ రవీంద్రభారతి ప్రధాన వేదికపై ఆరంభమైంది. పర్యాటక సాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని లాంఛనంగా వేడుకను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూనే జానపద ప్రక్రియలను కాపాడుకునే లక్ష్యంతో పని చేస్తోందన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అధ్యక్షత వహించిన సభలో రసమయి బాలకిషన్, అధికార భాష సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి పాల్గొన్నారు. అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి స్వాగతం పలికారు. ప్రముఖ నాట్య గురువు ఆనంద శంకర్ జయంత్ తన శిష్య బృందంతో భరతనాట్యం, ఆలేఖ్య పుంజల కూచిపూడి నాట్యాంశాలు నర్తించారు.