Authorization
Wed March 19, 2025 05:21:56 am
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన దీరవనిత చిట్యాల ఐలమ్మ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని మిస్టిక్ హిల్స్లో, ముసాపేట్ దోబీ ఘాట్లో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనతో పాటు బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు, కూకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు, తూము శ్రావణ్ కుమార్, మేడ్చల్ మైనారిటీ ప్రెసిడెంట్ శ్రీ గౌసుద్ధిన్ పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షులు సీహెచ్ ప్రభాకర్ గౌడ్, ముసాపేట్ డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు కర్క పెంటయ్య, లక్ష్మి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.