Authorization
Wed March 19, 2025 01:21:12 pm
- కాంగ్రెస్ సీనియర్ నేత సత్యం శ్రీరంగం
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి నియోజకవర్గం, బాలానగర్ డివిజన్ పరిధి, ఇంద్రానగర్లో ఐడీపీఎల్కు సంబంధించిన భూములు కబ్జాకు గురవుతున్నాయని, వీటిపై విచారణ జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత సత్యం శ్రీరంగం డిమాండ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ 10 ఎకరాల భూమిలో కబ్జాకు యత్నిస్తున్నారనే సమాచారంతో కూకట్పల్లి నియోజకవర్గం టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం గురువారం ఇంద్రానగర్ బస్తీ వాసులతో కలిసి ఇక్కడి ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పారెడ్డి, ఎ. బ్లాక్ అధ్యక్షులు పి. నాగిరెడ్డి, మధుగౌడ్, మహమ్మద్ హుస్సేన్, బాలానగర్ డివిజన్ అడహక్ కమిటీ అధ్యక్షుడు మట్టే ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.