Authorization
Wed March 19, 2025 07:08:57 am
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె పరీక్షలకు విశేష స్పందన లభించింది. 800 మంది ఉచిత గుండె పరీక్షలను పొందారని కామినేని హాస్పిటల్స్ ప్రకటించింది. నమోదు చేసుకున్న మరో 500 మందిని శుక్రవారం పరీక్షించారు. ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈసీజీ, 2డి ఎకో, బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ సూచించిన వారికి ఉచితంగా యాంజియోగ్రఫ నిర్వహించనున్నారు. సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాగర్ భుయాన్ మాట్లాడుతూ ''ఉచిత గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న వారిలో 45 శాతం మంది యువకులు లేదా మధ్య వయస్కులే. పరీక్షించిన వారిలో 5 శాతం మందికి తీవ్రమైన గుండె సమస్య లు ఉన్నాయి. 10-15 శాతం మందికి ఛాతీ నొప్పి, అలసట వంటి సాధారణ గుండె సమస్యలు ఉన్నాయి. మిగిలిన వారికి రక్తపోటు (బిపి), మధుమే హం వంటి ఇతర సమస్యలు ఉన్నాయి. వారందరూ సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. తగిన మందులతో పాటు తగిన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచించామని'' తెలిపారు.