Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 03,2022

గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం

- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌
- ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
           జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి భావితరాలకు ఆదర్శనీయులని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కమిషనర్‌ డీఎస్‌.లోకేష్‌కుమార్‌ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి, మాజీ ప్రధాన మంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ డీఎస్‌. లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఆంగ్లేయులు పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన నాయకులలో గాంధీ అగ్రగణ్యుడు అన్నారు. సత్యం, అహింస గాంధీ సిద్ధాంతాలు అని, సత్యాగ్రహం, సహాయ నిరహకరణ లాంటివి ఆయుధాలన్నారు. కులాలు, మతాలు అన్ని ఒకటేనని చాటి చెప్పిన మహనీయుడని, ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ ఆశయాలను కషి చేయడమే కాకుండా ఆదర్శంగా తీసుకోవాలని కమిషనర్‌ సూచించారు. స్వాతంత్య్రోద్యమంలో లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి ప్రముఖ పాత్ర పోషించారని, దేశ రెండో ప్రధాన మంత్రిగా పని చేసి 'జై జవాన్‌- జై కిసాన్‌' నినాదం ప్రస్తుత కాలంలోనూ ప్రజల హదయాల్లో గుర్తుండిపోయిందన్నారు. భారతదేశ ప్రజలకు కావాల్సిన ఆహార అందించేందుకు ఆహార ఉత్పత్తిని పెంచే అవసరాన్ని తెలియజేస్తూ వ్యవసాయ విప్లవానికి గ్రీన్‌ రివల్యుషన్‌, పాలఉత్పత్తి పెంచేందుకు వైట్‌ రివల్యూషన్‌ను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి అన్నారు. దేశ ఆర్థిక, సాంఘిక పరిస్థితులను మెరుగు పరచడానికి విశేష కషి చేసినట్టు కమిషనర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌సీ జియాఉద్దీన్‌, అడిషనల్‌ కమిషనర్‌లు విజయలక్ష్మి, యాదగిరిరావు, చీఫ్‌ వెటర్నరీ ఆఫీసర్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ అబ్దుల్‌ వకీల్‌, సీపీఅర్‌ఓ మొహమ్మద్‌ ముర్థుజా, పీఅర్‌ఓ జీవన్‌ పాల్గొన్నారు.
టీఎన్జీవో ఆధ్వర్యంలో నివాళి
మహాత్మ గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, సేవారత్న డాక్టర్‌ ఎస్‌.ఎం.హుస్సేనీ(ముజీబ్‌), వారి కార్యవర్గంతో కలిసి అదివారం గృహకల్పలోని సంఘం కార్యాలయంలో ఘనంగా నివాళులుర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్‌ ముజీబ్‌ మాట్లాడుతూ వీరిద్దరూ గొప్ప దేశ భక్తులు, స్వతంత్ర సమరయోధులు దేశ చరిత్రపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అహింస సిద్ధాంతం పాటిస్తూ దేశ స్వతంత్రం కోసం పోరాడి సాధించారని, వారి సిద్ధాంతాలు ప్రజలలో క్షమాగుణం పెరిగేలా చేసిందన్నారు. వారి మార్గదర్శములో దేశం లౌకిక దేశంగా పేరు తెచ్చుకున్నదనీ, తద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా విస్తరించాయని..వారి ఆశయాలని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విక్రమ్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు కె.ఆర్‌.రాజ్‌ కుమార్‌, కె.శ్రీనివాస్‌, నాల్గవ తరగతి సంఘ సహా అధ్యక్షుడు ఎం.ఏ.ముజీబ్‌, పీఆర్వో జహంగీర్‌ అలీ, ఏపీఆర్వో ఎండీ వహీద్‌, ముహమ్మద్‌ ముస్తఫా, ప్రిథ్వి, జాఫ్రీ, మహేష్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ 153వ జయంతిని పురస్కరించుకొని అదివారం అంబర్‌పేటలో ఉన్న గాంధీ విగ్రహానికి డ్రగ్‌ ఫ్రీ వరల్డ్‌ ఇండియా జూనియర్‌ అంబాసిడర్‌ తానియా బేగం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అబిడ్స్‌లోని డీఈవో కార్యాలయంలో
మహాత్మాగాంధీ 153వ జయంతి పురస్కరించుకొని అదివారం అబిడ్స్‌లోని డీఈవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి టీఎన్జీవో స్కూల్‌ ఎడ్యూకేషన్‌ డిపార్టుమెంట్‌ జిల్లా అధ్యక్షులు కె.ఆర్‌.రాజ్‌ కుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు దేవీ నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌లో
బాలానగర్‌: వర్ధమాన దేశాల చరిత్రలను ప్రభావితం చేసిన మహోన్నతుడు మహాత్మా గాంధీ అని టీపీసీసీ అధ్యక్షులు ఎ. రేవంత్‌ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌లో టీపీసీసీ అధ్యక్షులు ఎ. రేవంత్‌ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి బాపూజీ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి భారతీయులందరిచే ఆదరింపబడే గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు గాంధీ అని, ఆయన్ను ప్రజలు జాతిపితగా గౌరవిస్తారని అన్నారు. విశ్వమానవాళికి శాంతి, అహింసా సిద్ధాంతాలను ప్రబోధించి అవి మాత్రమే సుఖంగా, సంతోషంగా, స్థిరంగా ఉంచగలవని సందేశాన్నిచ్చి అనేక వర్ధమాన దేశాల చరిత్రలను ప్రభావితం చేసిన మహోన్నతుడని కొనియాడారు. ఎలాంటి రాజకీయ పదవులను ఆశించకుండా ప్రజా సేవకుడిగా చరిత్రలోమిగిలిపోయారన్నారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు, కొంపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ కందాడి జ్యోత్స్నా శివా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో..
ఓయూ: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ సికింద్రాబాద్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కెఎస్‌. శిల్పాచారి ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని చిలకలగూడ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో మొహమ్మద్‌ హుస్సేన్‌, విజయ్‌, గీత, జాకీర్‌, శ్రీనాథ్‌, పద్మజ, రాజ్యం, భాస్కర్‌, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్‌: రహమత్‌ నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌ హిల్స్‌ రెండు బొమ్మల సెంటర్‌ వద్ద స్థానిక కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మహమ్మద్‌ లియాకత్‌ అలీ, నాగరాజు, జ్ఞానేశ్వర్‌, జావీద్‌, కిషోర్‌ ,వినోద్‌, ఆండాలమ్మ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అంబర్‌పేట: మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకుని అంబర్‌పేటలోని గాంధీ విగ్రహానికి విజరు కుమార్‌గౌడ్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. యువత మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనిస్తూ గాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధార్‌ ముదిరాజ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెహదీపట్నం: సీపీఐ (ఎం) నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మల్లేష్‌, ఆవాజ్‌ అధ్యక్షుడు ఆలీ మెహదీపట్నంలో మహాత్మునికి ఘనంగా నివాళి అర్పించారు.
జగద్గిరిగుట్ట: దేశ స్వాతంత్రోద్యమంలో కీలక భూమిక పోషించిన మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని బాపూజీ హైస్కూల్‌ చైర్మెన్‌ కరస్పాండెంట్‌ నవ్వ ప్రభాకర్‌ రావు అన్నారు. ఆదివారం గాంధీజీ జయంతి పురస్కరించుకొని జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్‌లోని బాపూజీ స్కూల్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు ఎం. శ్రీనివాస్‌ ముదిరాజ్‌, దుర్గాప్రసాద్‌ ముదిరాజ్‌, నర్సింగ్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.