Authorization
Tue March 18, 2025 12:35:41 pm
- మేడ్చల్-మల్కాజిగిరి అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా 75 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. ప్రజావాణి ద్వారా వచ్చిన, దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి అందుకు అవసరమైన చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.