Authorization
Sun March 16, 2025 10:29:37 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మున్సిపాల్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. సోమవారం నాగారం మున్సిపాల్టీ 20వ వార్డులోని ఎంఎంఆర్ కాలనీలోని సాన్వి బ్లిస్ అపార్ట్మెం ట్ వద్ద నూతన డ్రయి నేజీ పనులను చైర్మెన్ సోమవారం ప్రారంభిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కాలనీలపరంగా నాగారం మున్సిపాల్టీ విస్తరించి ఉన్నందున ప్రజలకు అవసరం ఉన్న చోట అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ బి. మల్లేష్ యాదవ్, కమిషనర్ శ్రీ వాణి రెడ్డి, కౌన్సిలర్ అన్నంరాజుసుమిత్రా సురేష్, వ్యవసాయ కమిటీ డైరెక్టర్ భూపాల్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.