Authorization
Tue March 18, 2025 01:15:00 am
నవతెలంగాణ-నాగోల్
హైదరాబాద్లోని నందనవనం కాలనీకి చెందిన నిరుపేద కుటుంబం, అమ్మాయి, ఈగల జగన్, చంద్రకళల కూతురు ఈగల భాగ్యలక్ష్మి వివాహం కోసం సోమవారం ఉదయం హైదరాబాద్లోని నాగోల్లో ఉప్పల శ్రీనివాస్ గుప్త క్యాంప్ కార్యాల యానికి వచ్చి కలిసిన సందర్భంగా వారికి ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పెళ్ళి కూతురు భాగ్యలక్ష్మి, ఇ.చంద్రకళ, ఇ.జగన్, పి.యాదగిరిగౌడ్, ఎన్.కృష్ణ, ఎం.యాదగిరి, ఎస్.దర్శన్ యాదయ్య తదితరులు ఉన్నారు.