Authorization
Sun March 16, 2025 12:18:12 pm
- నవతెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రంగారెడ్డి నగర్ డివిజన్, గిరినగర్ ప్రధాన రహదారి మధ్యలో 'ప్రమాదభరితంగా మ్యాన్ హోల్' అనే శీర్షికన బుధవారం ప్రచురించిన వార్తకు అధికారులు ప్రజాప్రతి నిధులు స్పందించారు. శుక్రవారం రెండు చోట్ల మ్యాన్ హోళ్ల పైకప్పులు సిబ్బందితో వేయించారు. పత్రికలో ప్రచురించినందుకు గాను నవతెలంగాణ పత్రిక ప్రతినిధు లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పట్ల నిరంతరం అండగా ఉండేది నవతెలంగాణ అని ప్రశంసించారు.