Authorization
Fri March 14, 2025 09:24:31 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ రావు అన్నారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ అలీ తలాబ్ చెరువు వద్ద రూ.1.83 కోట్లతో నిర్మిస్తున్న అలుగు తూము నిర్మాణం, వ్యర్థ నీరు పైప్ లైన్ పనులను ఇరిగేషన్ అధికారులు, జీహెచ్ఎంసీ ఇంజనీ రింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగు తున్న ప్రాంతాల్లో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామన్నారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ విశ్వం, జీహెచ్ఎంసీ ఏఈ రాజీవ్, కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి, అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.