Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తపస్సు' సినిమాలో నటించిన దర్శకుడు భరత్ పారేపల్లి 27 సంవత్సరాల తరువాత ఓ రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'నాగలి'. ది డ్రీమ్స్ కంపెనీ బ్యానర్ పై శ్రీమతి పావని మొక్కరాల సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ, 'నూతన నటీనటులతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. సుదీప్ మొక్కరాల నిడదవోలు, అనుస్మతి సర్కార్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఎంఎల్ రాజా సంగీత సమర్పణలో జరిగాయి. రైతుల ఆత్మహత్యలు, వాళ్ళ కథలు, వెతలు కలబోతగా 1857 -58 మధ్య జరిగిన సిపాయిల తిరుగుబాటును తలపించేలా రైతుల తిరుగుబాటు నేపథ్యంలో ఈ సినిమా చేశాం. ఇందులో ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తూ నిర్మించాను. జనవరిలో ఆడియో విడుదల చేసి, ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చేస్తాం' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు - పెద్దాడ మూర్తి, సినిమాటోగ్రఫీ - వాసు వర్మ కఠారి.