Authorization
Wed May 07, 2025 07:50:22 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో మేడేపల్లి గ్రామంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్ సాగుచేసిన ఫామాయిల్ తోటను వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, నియోజకవర్గ రైతులతో సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తోటను కలియతిరిగి నిశితంగా పరిశీలించారు. అనంతరం ఎంపీపీ సామినేని హరిప్రసాద్తో మాట్లాడి సాగుకు అయ్యే ఖర్చు దిగుబడి వివరాలను ఆయన అడిగి ఆయన తెలుసుకున్నారు. అనంతరం జరిగిన పామాయిల్ సాగు అవగాహనా సదస్సులో ఎంపీపీ సామినేని హరిప్రసాద్ మాట్లాడారు. పామాయిల్ సాగుతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. పామాయిల్ సాగుపై రైతులకు పలు సూచనలు సలహాలు ఆయన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడేపల్లి సర్పంచ్ సామినేని రమేష్, ఉపసర్పంచ్ బి రమేష్, సొసైటీ డైరెక్టర్ పోటు ప్రసాద్, మేడిపల్లి రైతులతోపాటు నర్సంపేట రైతులు పలువురు పాల్గొన్నారు.