Authorization
Tue May 06, 2025 03:14:50 am
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని బూర్గంపాడు మండలం సారపాకలో గల ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారంలో సోమవారం భద్రాచలం టీఎన్టీయూసీ కార్యవర్గ సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంటరీ, పినపాక నియోజకవర్గ, బూర్గంపాడు మండల టీఎన్టీయూసీ కమిటీలను తెలంగాణ రాష్ట్ర టీయన్ టీయూసీ ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పోటు రంగారావు మాట్లాడుతూ టీఎన్టీయూసీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. ఐటీసీ భద్రాచలం టీయన్ టీయూసీ చైర్మన్ గల్లా నాగభూషణం మాట్లాడుతూ కార్మిక వర్గానికి టీయన్ టీయూసీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు కనకమేడల హరి ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.