Authorization
Wed May 07, 2025 10:14:36 am
నవతెలంగాణ-ములకలపల్లి
ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులతో ప్రతిభ కనబర్చిన ములకలపల్లి జూనియర్ కళాశాల విద్యార్ధిని ఈర్ల పావనిని మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి శనివారం శాలువాతో సత్కరించారు. ఇంటర్ ఫలితాల్లో 470 మార్కులకు 450 మార్కులు సాధించి కళాశాల, గ్రామానికి మంచిపేరు తెచ్చినందుకు గర్వంగా ఉందని విద్యార్థినినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీబినేని భద్రం, ఎంపీటీసీ శెనగపాటి మెహ్రా, శెనగపాటి సీతారాములు, రవి, నాగరాజు, వేముల రోశయ్య, లెక్షం, రాజేష్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు కృష్ణయాదవ్, యూత్ అధ్యక్షుడు తాటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.