Authorization
Tue May 06, 2025 12:51:59 pm
నవతెలంగాణ-టేకులపల్లి
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునీయన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సమ్మెను విజయవంతం చేయాలని గోడ పత్రిక నుశనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎఐటియుసి డివిజన్ కార్యదర్శి ఎండి.నజీర్ అహ్మద్ మాట్లాడారు. సింగరేణి కాలరీస్ను ప్రైవేటీకరణ నుండి, ఆర్థిక దోపిడి నుండి కాపాడుకోవడానికి కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. నేడు సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లను ఆహ్వానించిందని ఆరోపించారు. మార్చి 28, 29, తేదీల్లో జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. గొడ పత్రిక ఆవీష్కరణ కార్యక్రమంలో నాయకులు వెంకటనర్సయ్య, భావ్ సింగ్, కనకరాజు, సూరి, లక్ష్మయ్య, శ్రీనివాస్, మోహన్, మనోహర్ ప్రసాద్, రామకృష్ణ, కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.