Authorization
Mon May 05, 2025 12:21:27 pm
- దాసు ఆంజనేయ భక్త బృందం ఉదారత
నవతెలంగాణ-అశ్వారావుపేట
స్థానిక దాసు ఆంజనేయ స్వామి ఆలయం ''చాలీసా పారాయణ భక్తి బృందం ఉదారత చాటుకుంది. ఈ బృందం అధ్యక్షురాలు శీమకుర్తి రాధా కుమారి నేతృత్వంలో బృందం సభ్యులు ఆర్ధిక సౌజన్యంతో పేద ఒంటరి మహిళ దుర్గకు గ్యాస్ పొయ్యి, సిలిండర్, వంట పాత్రలు, దుస్తులు వితరణగా ఆలయం ప్రాంగణంలో అందజేసారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామకృష్ణ, పంతులు, చాలీసా పారాయణ భక్త సమాజం సభ్యులు పాల్గొన్నారు.