Authorization
Wed May 07, 2025 11:24:20 am
నవతెలంగాణ-ములకలపల్లి
మండలంలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, జీవశక్తి అభియాన్ నోడల్ అధికారి యువరాజులు శనివారం విస్తృతంగా పర్యటించారు. తొలుత ములకలపల్లిలోని బృహత్తర పల్లెప్రకృతి వనాన్ని సందర్శించిన వారు అక్కడి నుంచి పూసుగూడెంలోని బృహత్తర పల్లెప్రకృతినవంతో పాటు ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న ఇంకుడుగుంతలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వివిధ సబ్జెక్టుల్లో ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా మండలంలో బృహత్తర పల్లెప్రకృతి వనాల పెంపకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట పీడీ మధుసూదన్ రాజు, సీఈవో విద్యాలత, డీటీవో రమాకాంత్, జడ్పీటీసీ సున్నం నాగమణి, తహశీల్దార్ వీరభద్రం, ఎంపీటీసీ శెనగపాటి మెహరామణి, సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.