Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పత్తి ధర పతనం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Oct 28,2022

పత్తి ధర పతనం

- క్వింటాల్‌ రూ.12వేల నుంచి రూ.5వేలకు క్షీణత
- రోజురోజుకూ రేటు తగ్గుతున్నా అడ్రస్‌ లేని సీసీఐ
- అడ్డంగా దోచేస్తున్న వ్యాపారులు...పట్టని యంత్రాంగం
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఊపందుకున్న పత్తి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
             పత్తి ధరలు రోజురోజుకూ పతనం అవుతున్నాయి. మార్కెట్‌కు పత్తి రాక అధికమవుతున్నా కొద్దీ ధరల్లో క్షీణత కనిపిస్తోంది. రేటు తగ్గితే రంగంలోకి దిగుతామన్న కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆచూకీ లేదు. ఇదే అదనుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ విషయమై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా మార్కెట్‌ పాలన యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం క్వింటాల్‌ పత్తి గరిష్టంగా రూ.8,000, కనిష్ట ధర 6,000 పలుకగా నమోనా ధర రూ.7,000గా నిర్ధారించారు. కానీ వివిధ సాకులు చూపుతూ అధిక మొత్తం పత్తిని వ్యాపారులు రూ.5,000లోపే కొనుగోలు చేశారు. గురువారం మార్కెట్‌కు ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయిలో 11,979 బస్తాల సరుకు అమ్మకానికి వచ్చింది. సరుకు ఎక్కువగా రావడంతో వ్యాపారులు దోపిడీకి తెరదీశారు. పత్తి ఎంత బాగున్నా ధర తక్కువగానే పెట్టారు. చేసేది లేక రైతులు అరకొరగా పండిన పంటనుఅమ్ముకు వెళ్లారు.
పట్టని పాలనాయంత్రాంగం...అడ్రస్‌ లేని సీసీఐ
             జెండా పాటకు మార్కెట్‌లో అధిక మొత్తం సరుకు ధరలకు ఏమాత్రం పొంతన లేకపోవడంపై రైతులు మార్కెట్‌ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా...ఫలితం లేకపోయింది. ధర తగ్గినప్పుడు సీసీఐ రంగంలోకి దిగుతుందన్న అధికారులు ఆమేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఏడాది సీసీఐ పత్తి మద్దతు ధర క్వింటాల్‌ రూ.6,380గా నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్లో క్వింటాల్‌ పత్తి గరిష్టంగా రూ.8వేలు పలుకుతున్న నేపథ్యంలో సీసీఐ కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. ఇదే అదనుగా వ్యాపారులు అధిక మొత్తం పత్తిని రూ.5-6 వేల మధ్యనే కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, పంట దిగుబడులు తగ్గుతున్న నేపథ్యంలో క్వింటాల్‌ పత్తి రూ.12వేలకు పైగా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు.
సరుకు పెరుగుతున్నా కొద్దీ తగ్గుతున్న ధర
             ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఇటీవలికాలంలో పత్తి రాక ఊపందుకుంది. క్రమేణా ధరల్లో క్షీణత చోటుచేసు కుంటోంది. కొనుగోళ్లను పరిశీలిస్తే బుధవారంతో పోల్చితే గురువారం నాటికి పాట ప్రకారం గరిష్ట ధరల్లో రూ.153, కనిష్ట ధరలో రూ.200 తగ్గితే వ్యాపారులు మాత్రం రూ.1000 తగ్గించి కొనుగోలు చేశారు. గురువారం మార్కెట్‌కు 11,979 బస్తాలు రాగా రూ.8వేలు గరిష్ట, రూ.6,000 కనిష్ట ధరగా నిర్ధారించారు. బుధవారం 4,333 బస్తాలు వచ్చాయి. ఈనెల 21వ తేదీ 5,465 బస్తాలు రాగా వరుసగా రూ.8, 7, 6వేల ధరలు నిర్ణయించారు. ఇదే నెల 12న కేవలం 325 సంచులు రాగా గరిష్ట ధర రూ.9,107, సెప్టెంబర్‌ 21న 43 బస్తాలు రాగా గరిష్ట, నమూనా, కనిష్ట ధరలన్నీ రూ.9వేలకు పైగా నమోదయ్యాయి. ఆ రోజు గరిష్ట ధర రూ.9,500 నమోదైంది. ఇలా సరుకు ఊపందుకున్నా కొద్దీ ధరల్లో క్షీణత చోటుచేసుకోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.12వేలకు పైగా ఉంటేనే కొంతమేర గిట్టుబాటు...
             గతేడాది వరంగల్‌ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్‌ పత్తి రూ.12వేలకు పైగా ధర రావడం, వివిధ మార్కెట్లలో రూ.10వేలకు పైగా ధర నిలకడగా కొనసాగడంతో రైతులు ఈ ఏడాది పత్తి సాగు వైపు మొగ్గుచూపారు. దిగుబడి తగ్గినా ధరల్లో కలిసి వస్తుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలు చేస్తూ ఈ ఏడాది ధరల్లో భారీగా తగ్గుదల ఉండటంపై రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో 2020-21లో 60.54 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 2021-22లో 75 లక్షల ఎకరాలు, ఈ ఏడాది 85 లక్షల ఎకరాలకు పైగా సాగు చేశారు. గత ఐదారేళ్ల క్రితం వరకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి అయితే ఇప్పుడు ఏకంగా రూ.50,000 పెట్టుబడులవుతున్నాయి. కానీ ఈ నిష్పత్తిలో పంట ధరల్లో పెరుగుదల లేకపోవడంతో రైతులు డీలా పడుతున్నారు. గతంలో ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఇప్పుడు ఐదు క్వింటాళ్ల లోపే వస్తుందని వాపోతున్నారు. ధరల్లోనైనా కలిసి వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
దోపిడీ అరికట్టి...పాట ప్రకారం ధరివ్వాలి...
బాణోత్‌ రమేష్‌, బండమీది తండా, కూసుమంచి
             ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జెండా పాటకు అనుగుణంగా ధరలు ఇవ్వట్లేదు. ఇష్టమైతేనే అమ్మండి లేకుంటే లేదన్నట్లుగా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మిర్చికి పెట్టుబడి కోసమని పత్తిని అమ్ముదామని వచ్చా. రూ.12వేల వరకు అమ్మాల్సిన పత్తిని రూ.5వేలకే అడుగుతున్నారు. వ్యాపారులు, మార్కెట్‌ పాలనాయంత్రాంగం కుమ్మక్కై అడ్డగోలుగా ధరలు తగ్గిస్తున్నారు. నేను ఈ ఏడాది 2 ఎకరాల పత్తి వేశా. రూ.80వేలకు పైగా పెట్టుబడి పెట్టా. కానీ నాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడే వస్తోంది. ఇదే రేటు ఉంటే నేను నిలువునా నష్టపోవాల్సిందే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ
రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.