Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో పాక్షిక సూర్యగ్రహణం ముగిసింది.దేశంలోనూ పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఈ గ్రహణాన్ని చూశారు. తెలంగాణలో సైతం పలు ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది. ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత దేశంలో తదుపరి సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2న కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
హైదరాబాద్లో సాయంత్రం 4.59 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభం కాగా, ఢిల్లీలో సాయంత్రం 4.29 గంటలకు, కోల్కతాలో సాయంత్రం 4.52 గంటలకు, చెన్నైలో సాయంత్రం 5.14 గంటలకు, ముంబైలో 4.49 గంటలకు, ద్వారకలో 4.36 గంటలకు, తిరువనంతపురంలో 5.29 గంటలకు, నాగ్పూర్లో 4.49 గంటలకు గ్రహణం మొదలైంది. గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించడంతో పలువురు ప్రత్యేక పరికరాల సాయంతో వీక్షించారు. సూర్య గ్రహణం 1.45 గంటల పాటు సాగింది.