Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సికింద్రాబాద్ చిలకలగూడలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇళ్లు ధ్వంసమయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసి, క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీకవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.