Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీఎంఆర్ గడువు పొడిగించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. రైతుకు అనుకూల నిర్ణయాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయని తెలిపారు. 2021-22 వానాకాలం బియ్యాన్ని సమర్పించేందుకు ఈ ఏడాది నవంబర్ 30 వరకు భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) గడువును పెంచిందని చెప్పారు. అలాగే గత యాసంగి బియ్యం బాయిల్డ్ గా తీసుకునేందుకు మరో నాలుగు లక్షల టన్నులకు అనుమతించిందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఎనిమిది లక్షలు టన్నులతో కలిసి మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ సేకరణకు మార్గం సుగమమైందన్నారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు 180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి తెలిపారు.