Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా 'కాంతార`. ఈ సినిమా ఇప్పటికే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని ఓ థియేటర్ లో 'కాంతార` సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు.
వివరాల్లోకెళ్తే.. రాజశేఖర్(45) అనే వ్యక్తి కాంతార సినిమా చూసేందుకు సోమవారం నాగమంగళలోని వెంకటేశ్వర థియేటర్కు వెళ్లాడు. అతను తన స్నేహితులతో మార్నింగ్ షో చూస్తున్నాడు. సినిమా క్లైమాక్స్ సమయంలో అతను ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే థియేటర్ యాజమాన్యం స్పందించి అతడిని హాస్పిటల్ కు తరలించింది. కానీ అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు.గుండెపోటు వల్లే రాజశేఖర్ చనిపోయాడని వారు చెప్పారు. అతనికి గుండె సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.