Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : చైనాలోని వుహాన్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు జిల్లాల్లో మరోసారి పాక్షిక లాక్డౌన్ విధించారు. వుహాన్లోని హన్యాంగ్ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 18 కరోనా కేసులు బయటపడ్డాయి. అప్రమత్తమైన అధికారులు అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు. కేవలం సూపర్ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ లాక్డౌన్ నిబంధనలు వచ్చే ఆదివారం వరకూ ఉంటాయని అధికారులు తెలిపారు.