Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : ఈనెల 23న కోయంబత్తూర్లో కారు బాంబు పేలుడు ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఎన్ఐఏ దర్యాప్తు కోరింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు చేస్తున్న దర్యాప్తులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు వెలుగుచూడటంతో జాతీయ దర్యాప్తు సంస్థ సాయం కోరారు.
ఈ నెల 23న కోయంబత్తూరులో ఓ కారులో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో మృతి చెందిన మొబిన్తోపాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి మొబిన్ ఇంటి నుంచి తెచ్చిన బస్తాను కారులో పెట్టడం, ఆ తర్వాత కారులో పేలుడు జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో మొబిన్ ఇంట్లో సోదాలు చేయగా భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.